నిన్న టీ 20 మ్యాచ్ లో ధోని సూపర్ కీపింగ్, నోరు తెరిచినా బ్యాట్స్ మాన్ | దెబ్బకి అందరు షాక్ అయ్యారు, చాలా కష్టం ఆలా చేయటం

నిన్న టీ 20 మ్యాచ్ లో ధోని సూపర్ కీపింగ్, నోరు తెరిచినా బ్యాట్స్ మాన్ | దెబ్బకి అందరు షాక్ అయ్యారు, చాలా కష్టం ఆలా చేయటం 
భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్, శ్రీలంకను చిత్తుగా ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక జట్టు 87 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ తొలి టీ-20లో 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రాహుల్(61), ధోని(39), పాండే(32), శ్రేయస్(24) పరుగులు చేశారు. అనంతరం 181 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో కాస్త మెరుపులు మెరిపించారు. కానీ భారత బౌలర్ల దూకుడు ముందు నిలబడలేకపోయారు.
46 పరుగుల వరకూ కాస్త నిలకడగా ఆడిన లంక బ్యాట్స్‌మెన్లు ఆ తర్వాత వరుసగా పెవిలియన్ బాటపట్టారు. తరంగా(23), కుషల్(19), డిక్‌వెలా(13), చమీరా(12) మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔట్ అయ్యారు. దీంతో శ్రీలంక 16 ఓవర్లు ముగిసేసరికి 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలింగ్‌లో చాహల్ 4, హార్థిక్ 3, కుల్దీప్ 2, జయదేవ్ 1 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌ను భారత్ 1-0తేడాతో లీడ్‌లో ఉంది.

Comments